Tag Archives: indian folk tales

పిచుక గుణం

sparrow and crows

ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచుక వుండేది.

మనసులో ఏ కల్మషంలేని ఆ పిచుకకో ఒక రోజు ఒక కాకుల గుంపు పరిచయం అయ్యింది. ఆ కాకులతో పిచుకకి స్నేహం అయ్యింది.

పిచుకకి అందరూ చెప్పారు – ఆ కాకులతో స్నేహం చేయద్దు, అవి మంచివి కావు, అని. కాని ఆ పిచుక మాట వినలేదు.

ఒక రోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయక పిచుక ఎక్కడకి, ఎందుకు అని అడగకుండా, ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది.

కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నిటిని ధ్వంసం చేయ సాగాయి. పిచుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలీకా అటూ ఇటూ గెంతుతూ వుంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు. కాకుల గుంపుకు ఇది అలవాటే, అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచుక రైతులకు దొరికిపోయింది.

“బాబోయ్! బాబోయ్! నా తప్పేమీ లేదు, నేను అమాయకురాలిని, నేనేమీ చేయలేదు, నన్ను వదిలేయండి!” అని పిచుక ప్రాధేయ పడింది. కాని పంట నాశనం అయిన రైతులు కోపం మీద ఉన్నారు. పిచుక మాట నమ్మలేదు కదా, దాని వైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేసారు.

ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్దారించుకుంటారు. అందుకే మనం మంచి గా వున్న, మన స్నేహితులు చేడువారైతే మనం కూడా చెడ్డ వాళమనే అనుకుంటారు.

రాజులు మారెనో, గుర్రాలు ఎగిరెనో

shutterstock_551670577అనగనగా ఒక రాజుగారు తన రాజ్య పర్యటన చేస్తూ ఒక గుర్రాల బజారులోకి వెళ్ళారు. బజారులోని గుర్రాల వ్యాపారస్తులందరూ రాజుగారికి గుర్రాలు అమ్మాలని ప్రయత్నాలు మొదలెట్టారు. ఒకరిని మించి ఒకరు వారి వారి గుర్రాలను పొగడడం మొదలెట్టారు.

“నా గుర్రం మీరు చెప్పినట్టు చేస్తుంది” అని ఒకరంటే, “నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది” అని ఒకరు, “అసలు నా గుర్రానికి భయమే తెలీదు” అని మరింకొకరు గొప్పగా చెప్పుకున్నారు. ఒక వ్యాపారస్తుడు మరీ అతికి పోయి, “నా గుర్రం ఎగరగలదు” అన్నాడు.

వెంటనే రాజు గారు ఆ గుర్రాన్ని కొని, తనతో రాజు మహాలుకి తీసుకుని వెళ్ళారు.

మొన్నాడు నేసాధిపతిని పిలిచి, “ఈ గుర్రం ఎగురుతుంది” అని చెప్పారు. సేనాధిపతి ఆశ్చర్యపోయి, గుర్రాన్ని ఎగిరించే ప్రయత్నం చేసారు. కాని గుర్రం ఎలా ఎగురుతుంది? ఎగర లేదు.

రాజు గారు, “అదేంటి, నిన్న మరి నాతో వ్యాపారస్తుడు అలా చెప్పాడు, అతన్ని పిలవండి” అని ఆదేశించారు.

వ్యాపారస్తుడిని రాజుగారి ముందరు నిలపెట్టారు. రాజుగారు, “నిన్న నీ గుర్రం ఎగురుతుంది అన్నావు కదా, ఏది ఒక సారి ఎగిరించి చూపించు” అన్నారు.

“మహారాజా! గుర్రం ఎగురుతుంది, అంటే నా ఉద్దేశ్యం అంత వేగం గా పరిగేడుతుందని” అని వ్యాపారస్తుడు చెప్పాడు.

రాజుగారికి చాలా కోపం వచ్చింది. “ఇతని తల నరికేయండి!” అని ఆదేశించారు.

ఆ తర్వాత ముఖ్య మంత్రిని పిలిచారు. “ముఖ్య మంత్రి! నాకు ఈ గుర్రం ఎగిరితే చూడాలని ఉంది! ఈ పని మీరే చేయాలి!” అన్నారు.

ముఖ్య మంత్రి దంగ్ అయిపోయి, “మహారాజా! గుర్రం ఎలా ఎగురుతుంది, ఆ వ్యాపారస్తుడు అబద్ధం చెప్పానని ఒప్పుకున్నాడు కదా!” అన్నారు.

మహారాజు వెంటనే, “ఇతని తల నరికేయండి!” అని ఆదేశించారు.

ఇలా ఒక్కొక్కరినీ పిలవడం, వాళ్ళను గుర్రం ఎగిరించి చూపించ మానడం; వారు అదెలా సాధ్యం అని అడిగితే వారి తల తీసేయడం, కొన్ని రోజులు ఇలా గడిచాయి.

మొత్తానికి ఒక రోజు ఒక సభికుడిని పిలిచే, రాజు గారు గుర్రాన్ని ఎగిరించమని ఆజ్ఞాపించారు.

సభికుడు తల వంచి, “అలాగే మహారాజా! నాకు ఒక సంవత్సరం గడువు ఉవ్వండి, నేను ప్రయత్నం చేస్తాను!” అని ఒప్పుకున్నాడు.

రాజు గారు సంతోషించి, ఒక సంవత్సరం గడువు ఇవ్వడానికి ఒప్పుకున్నారు.

సభికులు, రాజ్యంలో వున్న వారందరూ ఆశ్చర్యపోయారు. “ఎలా ఒప్పుకున్నావు? అసలు గుర్రం ఎలా ఎగురుతుంది? నీ దెగ్గిర ఏమైనా ఉపాయముందా?” అని రక రకాల ప్రశ్నలు అడిగారు. సభికుడు చిరునవ్వుతో తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు.

ఊరంతా నిప్పులా పాకిపోయిన ఈ వార్త ఇంట్లో వున్న అతని భార్యకి కూడా తెలిసింది. ఆందోళనగా ఆటను ఇంటికి వచ్చే దాకా గుమ్మం మీద కాపు కాసింది. ఇంటికి భర్త రాగానే విన్నది నిజమేనా అని అడిగింది.

సభికుడు నిజమే కానీ ఖంగారు పడద్దు అని భార్యను ఇలా ఓదార్చాడు – “మూర్ఖుల మనసులో ఒకటి పడితే అది సాధించాలన్న పట్టుదల బలంగా మొదలవుతుంది. వారితో వాదించడం కష్టం. మహారాజు గారి మనసులో ఈ విషయం అలాగే బలంగా పడిపోయింది. వారిని కాదన్న వారి తలలు నరికించేసారూ. నన్ను అడిగిన వెంటనే నేను కూడా కుదరదు అంటే నా తల కూడా వెంటనే తెగేది.

ఒక సంవత్సరం గడువు అడిగితే వెంటనే ముందరున్న ప్రమాదం తొలిగింది కదా! ఆ పయిన చూద్దాం! యాడాదిలో ఏమైనా కావచ్చు. రాజు గారు ఈ విషయం మరిచిపోవచ్చు! లేదా పట్టుదల తగ్గవచ్చు! భవిష్యత్తు ఎవరు చూసారు? రాజులు మారెనో, గుర్రాలు ఎగిరెనో!”

అనంతుడి కోరిక

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్నిదించి భుజానవేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా స్మశానానికేసి నడవసాగాడు.

అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, విద్యాదికుదివైన నువ్వు, భీతగోల్పే ఈ స్మశానంలో, నిశిరాత్రి వేళ ఇన్ని కష్టాలను సాహిస్తున్నావంటే నమ్మసఖ్యం కాకుండా వున్నది. ఇంతకూ దీనికి కారకులు, నీ మంచితనాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించు కుంటున్న కుత్సిత మనస్కులై వుండాలి. అలాంటి వాళ్ళ వలలో చిక్కి, కార్యసాధన తర్వాత అవివేకం కొద్దీ తనమేలును కూడా మరచిన అనటుడనే యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను.” అంటూ ఇలా చెప్పసాగాడు:

పూర్వం మందారకమే దేశాన్ని సత్కీరుడనే రాజు పరిపాలించేవాడు. విరజుడు, సత్కరుడి ఒక్కగానొక్క కొడుకు. అతడికి కాస్త వయసురాగానే రాజు, అతణ్ణి గోబిలుడనే గురువు నడిపే గురుకులానికి పంపించాడు.

anantudu_1గురుకులంలో మొత్తం పదిమంది విద్యార్దులున్దేవారు. వారిలో ఒక్క అనటుడనే విద్యార్ధి తప్ప మిగిలినవారందరూ, విరజుడు రాజుకుమారుడనే భయభక్తులతో కొంచెం ఎడంగా మసిలేవారు. అయితే అనంతుడు మాత్రం మొదటి రోజునే విరజుడిని ఆదరంగా పలకరించి స్నేహం కలుపుకున్నాడు. శాంతంగా, ఆత్మీయంగా ప్రవర్తించే అనంతుడు విరజుడికి కూడా నచ్చటంతో వారి స్నేహం దినదిన ప్రవర్ధమానం కాసాగింది.

అయితే, విరజుడిలో తను రాజకుమారుదనన్న అహంకారానికి మూర్ఖత్వం కూడా తోడూ కావడంతో, అనంతుడి మీద అప్పుడప్పుడూ అధికారం చలాయించేవాడు. అయినప్పిటికీ అనంతుడు కోపం తెచ్చుకోకుండా విరజుది పట్ల మిత్రభావాన్ని ప్రదర్శించేవాడు.

విరజుడికి గురువు చెప్పే పాఠాలు ఒకంతట తలకేక్కేవి కాదు. అయితే అతడు గురువు దగ్గర ఏమీ మాట్లాడక, తీరిక సమయాలో అనంతుడిని వేధించేవాడు. అనంతుడు ఏమాత్రం విసుగు చెందకుండా పాఠ్యాంశం విరజుడికి గ్రాహ్మయ్యేలా ఒకటికి నాలుగు సార్లు భోదించే వాడు.

ఈ విధంగా విరజుడు చదువులో కాస్త చురుకుతనం పున్జుకోగానే, గురువు గోబిలుడు దాన్ని గమనించి, అతడికి మరింత ప్రోత్సాహజనకంగా వుండడం కోసం, అడపాదడపా ప్రశ్నించటం ప్రారంభించాడు. మొట్ట మొదటిసారి గురువు ప్రస్నించ గానే విరజుడు, అనంతుడితో, “అనంతా! ఈ రోజు గురువుగారు నన్ను ప్రస్నిన్చారంటే, ఆ ఘనత అంతా నీదే. నీ మేలు ఎన్నటికీ మర్చిపోను. నేను రాజునవగానే నిన్ను నా ప్రధాన మంత్రిని చేసుకుంటాను!” అన్నాడు.

విరజుడి మాటకు అనంతుడు చాలా సంతోషించాడు. గోబిలుడు కూడా ఆ సంగతి విని చాలా ఆనందించి, విరజుడిని మరింతగా మెచ్చుకుంటూ, “నాయనా, మనిషిని పశుత్వం నుంచి వేరు చేసే ఉత్తమ గుణాల్లో కృతజ్ఞత ఒకటి! నువ్వు అనంతుడి పట్ల చాలా ఉదాత్తంగా ప్రవర్తించావు. ఈ రోజు నువ్వు చేసిన వాగ్దానాన్ని కలలో కూడా విస్మరించకుండా నిలబెట్టుకో” అని హితవు పలికాడు. విరజుడు అలాగేనన్నట్టు తలాడించాడు.

అయితే, ఆ తర్వాత జరిగింది మాత్రం వేరు. అతడు క్రమేపీ చదువులో కొంత రాణిస్తూ, నానాటికీ అహంకారం పెంచుకుని, అనంతుడిని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. అలా కొంత కాలం గడిచి, ఇద్దరి విద్యాభ్యాసం ముగింపుకు వచ్చేనాటికి, విరజుడు తన వాగ్దానాన్ని పూర్తిగా మరిచినట్లు అందరికీ తెలిసిపోయింది.

అనంతుడు గురుకులంలో తన విద్యాభ్యాసం ముగియగానే, గురువు గోబిలుడితో, “స్వామీ! నాకింకా విద్యా తృష్ణ తీరలేదు. తమరు అనుమతిస్తే, ఆరావళీ పర్వత పాదాల వడ్డన వున్న కృష్ణచంద్రులవారి గురుకులంలో కొన్నేళ్ళు విద్యాభ్యాసం చెయ్యాలని వుంది. ఆ తర్వాత అవసరమనిపిస్తే, విరజుడితో అతడు నాకు చేసిన వాగ్దానం గురించి మాట్లాడతాను.” అన్నాడు.

గోబిలుడు, అనంతుడు కోరిన దానికి సంతోషంగా, “ఆ మహనీయుడి దగ్గర శిష్యరికం చేసే పరిపూర్ణమైన అర్హత నీకుంది. వెళ్లిరా నాయనా, శుభస్య శీఘ్రం!” అంటూ ఆశీర్వదించి పంపించాడు.

ఆ తర్వాత, విరజుడు కూడా గురు దక్షిణ చెల్లించి, రాజధానికి తిరిగి వెళ్ళాడు. నెమ్మదిగా ఆరు సంవత్సరాలు గడిచాయి. విరజుడికి పట్టాభిషేకం జరిగింది. అతడు రాజవుతూనే, తనకు పూర్తీ అనుకూలంగా ప్రవర్తించే సుప్రతీకుదనేవాడిని తన ప్రధానసలహాదారుడిగా నియమించుకున్నాడు. పాలనా వ్యవహారాల్లో, ఈ ప్రధాన సలహాదారు మాట వేదవాక్యంగా చెల్లడం ప్రారంభించింది.

anantudu_2సుప్రతీకుడు, రాజూ కలిసి వినూత్న పరిపాలన పేరిట, పరిపాలనలో అనేక మార్పులూ, సంస్కరణలూ ప్రవేశపెట్టారు. ఇందువల్ల ప్రజలు లేనిపోని అయోమయావస్థ లో పడి, తమకు అటువంటి దురవస్థ కలిగించిన రాజు పట్ల తీవ్రమైన అయిష్టత కనబరచ సాగారు. ఇదే ఊతంగా చేసుకుని పొరుగు రాజు, విరజుడి రాజ్యంపై దండెత్తాలను కుంటున్నాడని గూఢచారులవల్ల విరజుడికి తెలిసింది. విరజుడు కాస్త కొంగారుపడి, సుప్రతీకుడిని సంప్రదించాడు.

సుప్రతీకుడు తేలిగ్గా, “భయం ఎందుకు, ప్రభూ! మనం హేచ్చువేతనం మీద మరింత మందిని సైన్యంలో చేర్చుకుని, మనమే ముందుగా పొరుగురాజు మీద దండెత్తుదాం. ఆ రాజ్యం కూడా మనవసమైతే, తమరి కీర్తి ప్రతిష్ఠలు నలుదిశలా మరింత ఇనుమడిస్తాయి!” అన్నాడు.

“నువ్వు చెప్పెదీడీ చిటికలో ముగిసే పనికాదు. మన ఖజానాలో అంతగా నిల్వదబ్బు లేదని, నీకు తెలియనిదా?” అన్నాడు.

దానికి సుప్రతీకుడు నవ్వి, “మన ఖజానా నింపేందుకు, ఒక తిరుగులేని ఉపాయం ఆలోచించాను. యక్షిణిశైలం గురించి మీకు తెలుసుగదా?” అన్నాడు.

anantudu_3విరజుడికి యక్షిణి శైలం గురించి తెలుసు. మందార దేశానికి ఉత్తరపు టెల్లగావున్న పెద్ద పర్వతాన్ని యక్షిణి శైలం గా వర్ణించి చెబుతారు. ఆ పర్వతం మీదవున్న ప్రాచీన శివాలయం ముఖమండపం దగ్గర, దేవనాగారలిపిలో వున్న ఒక శిలా శాసనం వుంది. అందులో, ఈ ఆలయం ముందున్న కోనేటి మధ్యభాగంలో నిరంతరం వేగంగా తిరిగేసుడి ఒకటున్నది. మంత్రం తంత్ర శాస్త్రజ్ఞాని, సాహసీ, నిస్వార్థ పరుడూ అయిన యువకుడు, ఆ సుడిలో ప్రవేశించి అక్కడ ఎదురయ్యే యక్షమాయను జయిన్చినట్లయితే, అతడికి అష్ట సిద్ధులూ, నవనిదులూ లభిస్తాయి, పరాజితుడైతే అక్కడి నుంచి నరక కూపంలోకి తోయ బాదుతాడు, అని వున్నది.

సుప్రతీకుడి మాటలో అదంతా గుర్తు తెచ్చుకుని విరజుడు బిక్కముఖం వేసి, “యక్షిణీ శైలం గురించి తెలిసి ఏం లాభం? ప్రాణాలకు తెగించి, ఆ కోనేటిలో దూకడం నా వల్ల కాదు!” అన్నాడు.

ఆ జవాబుకు సుప్రతీకుడు నవ్వి, “అక్కడికి మిమ్మల్ని వెళ్ళమని చెప్పడం లేదు, ప్రభూ! అనంతుడనే యువకుడొకడు కొత్తగా మన రాజ్యానికి వచ్చాడు. అతడు ఆరావళీ ప్రవత ప్రాంతంలోని కృష్ణ చంద్రుడనే గురూత్తముని వద్ద మంత్రం శాస్త్రాన్ని కూలంకషంగా అభ్యసించాడట. ఇతర విద్యలు కూడా అతడికి కరతలామలకాలేనట. అతడు మన వర్తకుల శ్రేష్టి ఇంట ఆతిధ్యం పొందారు. ఆ అనంతుడు గొప్ప సాహసి అనీ, ఎన్నదగ్గ నేస్వార్తపరుడని ప్రజలు చెప్పుకుంటున్నారు. మనం ఆ అనంతుడిని పిలిపించి, రాజ్య క్షేమం కోసం యక్షిణి శైలికి వెళ్ళమని అడుగుదాము. నిధులతో తిరిగి వస్తే, అతడి ఎట్టు బంగారాన్ని బహుమానంగా ఇస్తామని చెబుదాం. ఏమంటారు?” అని అడిగాడు.

అనంతుడి పేరు వింటూనే ఉలిక్కి పడిన విరజుడు, ఒక్క క్షణం ఆలోచించి, సుప్రతీకుడు చెప్పిన దానికి అంగీకరించాడు. మరుక్షణమే అనంతుడికి కబురు వెళ్ళింది.

అనంతుడు రాగానే విరజుడు ఎంతో అభిమానంగా కుశల ప్రశ్నలు వేసాడు. తర్వాత, యక్షిణిశైలాన్ని గురించి చెప్పిన దంతా శ్రద్ధగా విన్న అనంతుడు, “ప్రభూ! మనం ఒకరి గురించి ఒకరికి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తులం. మీ కోరిక ప్రకారం నేనీ యక్షిణిశైలానికి తప్పక వెళతాను,” అన్నాడు.

అన్నమాట ప్రకారం అనంతుడు ఒకానొక సుముహూర్తాన యక్షిణిశైలానికి వెళ్లి మంత్రం జపించి కోనేటిలో దిగాడు.

అనంతుడిటో బాటే వెళ్లి, కోనేటి ఒడ్డునే కూర్చున్న విరజుడికి, చాలా సేపు గడిచిన తర్వాత, అనంతుడు రెట్టింపు తేజస్సుతో ప్రకాశిస్తూ, కోనేటి నుంచి బయటకిరావడం కనిపించింది. అతడు వెంటనే అనంతుడి దగ్గిరకు వెళ్లి చెయ్యి పట్టుకుంటూ ఆతృత గా, “అనంతా! నిధి దొరికిందా, ఏదీ?” అంటూ ప్రశ్నించాడు.

anantudu_4అనంతుడు మందహాసం చేసి, “రండి, చూపిస్తాను, మీకెలాంటి ప్రమాదం కలగదు!” అని విరజుది చెయ్యి పట్టుకుని మళ్ళీ కోనేటిలో దిగాడు. దాని అట్టడుగున సూర్యకిరణాల్లా ప్రకాశిస్తున్న నవ రత్నాల గుట్టలు కనిపించాయి. విరజుడు మంత్రం ముగ్దుడిలా అయిపోయాడు. అప్పుడు అనంతుడు ప్రశాంతంగా, “ప్రభు! నేను సాధించిన ఈ అమూల్యమైన నిదినిక్షేపాల్ని, మీ కోరిక ప్రకారం రాజ్యక్షేమంకోసం వినియోగించేందుకు, ఈ క్షణమే మీ పరంచేస్తాను. అయితే దీనికి ప్రతిఫలంగా, మీ నుంచి నాకు కావలసింది బంగారం మాత్రం కాదు!” అన్నాడు.

ఆ మాటలకు విరజుడు చాలా ఆశ్చర్యపోతూ, “మరేమి కావాలి?” అని ప్రశ్నించాడు? మీరు పూర్వం గురుకులంలో చేసిన వాగ్దానం ప్రకారం, నన్ను మీ ప్రదానామాత్యుడిగా నియమించుకొంది. అదే నాకు   కావలసింది!” అన్నాడు అనంతుడు గంభీరంగా.

విరజుడు ఆ మాట వింటూనే కొద్ది క్షణాలు నోటమాట రాని వాడిలా వుండిపోయి, తర్వాత కాళ్ళ నీళ్ళు పెట్టుకుని వంగి అనతుడి పాదాలు స్పృశించి, “మహానుభావా! నువ్వు సామాన్య మానవుడివి కావు. ఈ క్షణం నుంఛీ నువ్వే నా ప్రధాన మంత్రివి! నీ అనుజ్ఞ లేనిదే నేనిక ఊపిరి సైతం పీల్చను!” అన్నాడు.

బేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా, నిధి సంపాదనలో, విరజుడి స్వార్థం తేట తెల్లమవుతూనే వుంది. ఎటొచ్చి ఎంతో విద్యాధికుడూ, సాహసీ అయిన అనంతుడి ప్రవర్తనే అవివేకంగా కనబడుతున్నది. అతడు నిస్వార్థ పరుడైన పక్షంలో నిధుల్ని విరజుడికి అప్పగించి ప్రతిఫలం ఏమీ ఆశించకుండా వెళ్లి పోవాలి. లేదా సాధించిన నిధిలో కొంత తీసుకోవాలి. అదీ గాక ఇదీ గాక, విరజుడు కపటి, అతడు చేసే వాగ్దానాలకు విలువలేదని ఎరిగి, మంత్రి పదవి కోరడం ఏమన్నా విజ్ఞత అనిపించు కుంటుందా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావా, నీ తల పగిలి పోతుంది!” అన్నాడు.

దానికి విక్రమార్కుడు, “అనంతుడు మొదటి నుంఛీ రాజ్యక్షేమాన్ని కోరిన నిస్వార్థ పరుడు. అందుకే అతడు, భావి మహారాజైన విరజుడికి గురుకులంలో తగిన సహాయం చేశాడు. విరజుడు కపటి, స్వార్థ పరుడు కావచ్చు. కాని, అప్పటి పరిస్థితుల్లో, ప్రజల వ్యతిరేకత, ఖజానాలో దానం లేకపోవడం, పొరుగురాజు దండ యాత్ర భయం, పాలనా వ్యవహారాల్లో సుప్రతీకుడి లాంటి అల్పగ్నుడి సలహాలు – వీటన్నిటి కారణంగా దేసరక్షణకు తనలాంటి వాడి అవసరం ఉన్నదన్న గట్టి నమ్మకం తోనే, అనంతుడు మంత్రి పదవిని కోరాడు. ఇది అతడి దేసభాక్తిని, రాజకీయ పరిజ్ఞాతాన్నీ చాటి చెబుతుంది. ఇది గొప్ప వివేకం. అవివేకం అంటూ ఇందులో ఏ మాత్రం లేదు!” అన్నాడు.

రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, మళ్ళీ తిరిగి చెట్టెక్కాడు.

anantudu_5

Source: Chandamama, February 2004.
 

కట్టెలుకొట్టేవాడి కథ

shutterstock_577863937

Image: Ritu Jagya / Shutterstock.com

అనగనగా ఒక కట్టెలుకొట్టే వాడు ఉండేవాడు. అతను చాలా కష్టపడే వాడు. తెల్లారకుండానే అడవిలోకి వెళ్లి, కట్టెలు కొట్టుకుని, ఊరిలో ఆ కట్టెలు అమ్ముకుని జీవితం కొనసాగిస్తూ ఉండేవాడు.

అలా ఉండగా ఒక రోజు కాలవ గట్టున చెట్టు నరుకుతుంటే తన గొడ్డలి నీళ్ళల్లో పడి పోయింది. నీళ్ళల్లో చాలా సేపు గొడ్డలిని వెతుక్కున్నాడు. కానీ లాభం లేక పోయింది. ఎక్కడా గొడ్డలి దొరకలేదు.

కాలవ గట్టున కూర్చుని, అయ్యో అని బాధ పడుతూ ఎడిచాడు. రెక్క ఆడనిదే డొక్క ఆడాడు, అన్నట్టు, పని చేస్తేనే పూట గడిచే పరిస్థితి. గొడ్డలి లేకపోతే కట్టెలు కొట్ట లేడు. కట్టెలు కొట్టక పొతే, అవి అమ్మ లేడు. అమ్మక పొతే, డబ్బు ఉండదు. డబ్బు లేకపోతే, కుటుంబమంతా పస్తులు ఉండాలి. ఇవన్నీ తలుచుకుని కళ్ళు మూసుకుని గట్టిగా వన దేవతని ప్రార్థించాడు. ఎలాగైనా గొడ్డలి దొరికేలా చూడు తల్లీ, అని మనసారా మొక్కు కున్నాడు.

దేవత ప్రత్యక్షం అయ్యింది. విషయం తెలుసుకుని, నదిలోకి దిగి, ఒక బంగారు గొడ్డలి తీసింది. “ఈ గొడ్డలి నీదా?” అని అతన్ని అడిగింది.

అతను, “కాదమ్మా, ఇది నాది కాదు” అని చెప్పాడు.

దేవత మళ్ళీ నీళ్ళల్లో దిగి, ఒక వెండి గొడ్డలి తీసింది. “ఈ గొడ్డలి నీదా?”

“కాదమ్మా, ఇది కూడా నాది కాదు” అని అతను బదులు చెప్పాడు.

ఈ సారి దేవత చాలా సేపు నీళ్ళల్లో వెతికింది. వడ్డున కట్టెలుకొట్టే వాడు చాలా ఖంగారు పడుతున్నాడు. తొందరగా దొరికితే బాగుండు అని మనసులో అనుకుంటూ ఉండగా, దేవత ఒక మామూలు ఇనుప గొడ్డలి చూపించి, “ఇది నీదా?” అని అడిగింది.

సంతోషంతో అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అమ్మయ్య అనుకుని, “అవునమ్మ! ఇదే నాది!” అని అందుకోవడానికి చేతులు జాపాడు.

వన దేవత అతని నిజాయితీని మెచ్చుకుని, అతని ఇనుప గోడ్డలు ఒకటే కాక, ఆ బంగారం గొడ్డలి, వెండి గొడ్డలీ కూడా అతని చేతుల్లో పెట్టింది. “నీ నిజాయతీ నాకు నచ్చింది, ఇవి కూడా ఈ రోజు నుంచి నీవే!” అని చెప్పింది.

కట్టెలు కొట్టే వాడు కళ్ళకి అద్దుకుని మూడు గోడెల్లూ తీసుకున్నాడు.

ఆ రోజు బజారులో ఒక వ్యాపారస్తుడికి వెండి గొడ్డలి, బంగారం గొడ్డలి అమ్మాడు. వచ్చిన సొమ్ముతో కుటుంబ పరిస్థితులు మార్చోవాలనుకున్నాడు.

అవి కొనుక్కున్న షావుకారు, “ఇవి నీకు ఎక్కడివి?” అని ఆశ్చర్యంగా అడిగాడు.

కట్టెలు కొట్టేవాడు జరిగిందంతా చెప్పాడు.

ఆ షావుకారుకి అత్యాశ కలిగింది. వెంటనే అతను కూడా ఒక గొడ్డలి తీసుకుని వెళ్లి, కాలవలోకి విసిరేసి, వన దేవతని ప్రార్థించాడు.

వన దేవత ప్రత్యక్షం అయ్యింది.

షావుకారు, “నా గొడ్డలి ఏట్లో పడిపోయింది, కొంచం సహాయం చేయి తల్లీ” అని ప్రాధేయ పడ్డాడు.

వన దేవత నీళ్ళల్లో దిగి, ముందర లాగానే ఒక బంగారం గొడ్డలి తీసింది. “ఇది నీదా?” అని అడిగింది.

ఆ షావుకారు కళ్ళు తిరిగాయి. అంత బహుమూల్యమైన గొడ్డలి కళ్ళెదురుగా కనిపిస్తుంటే, ఉండ పట్టలేక, “అవునమ్మ! ఇది నాదే!” అని అబద్ధం చెప్పాడు.

వన దేవతకి కోపం వచ్చింది. “అబద్ధం!” అని మాయం అయిపొయింది.

షావుకారుకి కొత్త బంగారం గొడ్డలి దొరకలేదు సరికదా, తెచ్చుకున్న పాతది కూడా కాలవలో ఎక్కడా కనిపించ లేదు.

ఇందుకే పెద్దలు ఎప్పుడు నిజం చెప్పమంటారు. నిజం చెప్పే వాళ్ళకీ ఎప్పటికో అప్పటికి మంచి జరుగుతుంది. కానీ అబద్ధం ఆడే వాళ్లకి మట్టుకు ఏదో ఒక రోజు మొదటికే మోసం వస్తుంది.

 

 

స్వభావానికి తగ్గట్టు వృత్తి

shutterstock_551670577

Image: Ritu Jagya / Shutterstock.com

ఒక రోజు అక్బర్ మహారాజు తన సభలో, “మనుషులు వారి స్వభావానికి తగ్గ వృత్తి ఎంచుకుంటారు” అని అన్నారు.

అది బీర్బల్ ఒప్పుకో లేదు. మనిషి వృత్తికీ స్వభావానికి సంబంధం ఉండదని ప్రస్తావించాడు.

అక్బర్ కి బీర్బల్ అంటే చాలా ఇష్టం. అతని తెలివి తేటలు, మేధస్సు మీద చాలా నమక్కం. కాని, అప్పుడప్పుడు పరీక్షలు పెట్టడం సరదా.

అందుకనే మనిషి వృత్తి కి, స్వభావానికి సంబంధం లేదు అని బీర్బల్ అంటే, అక్బర్ వెంటనే ఆ విషయం నిరూపించి చూపించమని బీర్బల్కి పరీక్ష పెట్టారు.

“సరే, రేపు ఇద్దరం మారు వేషం వేసుకుని నగర పర్యాటన చేద్దాము, ఈ సత్యానికి నిదర్శనం నేను మీకు రేపు చోపిస్తాను!” అని బీర్బల్ ఒప్పుకున్నాడు.

అనుకున్న ప్రకారం మొన్నాడు ఇద్దరూ మారు వేషం వేసుకుని నగర పర్యాటన చేసారు. నగరంలో ఒక మిఠాయిలు అమ్ముకునే వ్యాపారస్తుడు కనిపించాడు.

బీర్బల్ చాలా దీనంగా మొహం పెట్టి, మిఠాయిలు అమ్ముకుని అతని దగ్గిరకి వెళ్లి, “మేము పోరుగూరినుంచి వస్తున్నా బాటసారులము. దారిలో దొంగలు పడి, ఉన్నదంతా దోచుకున్నారు! ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది, కొంచం సహాయం చేస్తారా? తినడానికి మీ కొట్టు లోంచి ఏమైనా ఇప్పించండి!” అని నాటకం ఆడాడు.

మిఠాయి కొట్టులో కూర్చున్న వ్యాపారస్తుడు  చీదరించుకుని, “ఛీ! ఛీ! ధందా చేసుకునే టైం లో ఈ గోలేంటి! నిన్ను చూసి కొనే వాళ్ళు కూడా రారు! పొ! పొ!” అని చికాకుగా ధుత్కరించాడు.

బీర్బల్ ఊరుకో కొండా, చాలా ఆకలి వేస్తోంది అని బ్రతిమాలాడు.

మిఠాయి అమ్ముకునే వ్యాపారస్తుడు తన చుట్టూరా తినుభండారాలు పెట్టుకుని కూడా ఏ మాత్రం చలించలేదు. సహాయకుల చేత బీర్బల్ ని మెడ బెట్టి కొట్టు బయటకు గెంటించాడు.

బీర్బల్ అక్బర్ మహారాజుతో అలాగే మారువేషంలో అక్కడ నుంచి వెళ్లి పోయాడు.

ఒక బండలు కొట్టే మేస్త్రి కనిపించాడు.

అలాగే మారు వేషంలో ఇద్దరూ ఆ బండలు కొట్టే అతని దగ్గిరకు వెళ్ళారు. బీర్బల్ మళ్ళీ అదే నాటకం ఆడాడు.

“అయ్యా! మేము పోరుగూరినుంచి వస్తున్నా బాటసారులము. దారిలో దొంగలు పడి, ఉన్నదంతా దోచుకున్నారు! ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది, కొంచం సహాయం చేస్తారా?” అని మేస్త్రికి కూడా అదే కథ చెప్పాడు.

ఆ మేస్త్రి వెంటనే, “అయ్యో! అలాగా! నాతొ రండి.” అని అతని కుటీరానికి తీసుకుని వెళ్ళాడు. వాళ్లకు కాళ్ళు కడిగి, ఇంట్లోకి తీసుకుని వెళ్లి, ఉన్న కొంచంలోనే భార్యను అతిథులకు తగ్గ భోజనం తయారు చేసి వడ్డించ మన్నాడు.

అతని భార్య కూడా అలాగే అన్నం, కూర, పచ్చడి, పులుసు, తయారు చేసి, రుచికరమైన భోజనం వడ్డించింది.

భోజనం అయ్యాక, కొంచం సేపు విశ్రాంతి తీసుకోమని అరుగు మీద మంచాలు నీడలోకి లాగి అక్బర్, బీర్బల్ కి విసినికర్రలు ఇచ్చాడు.

ఇలా మర్యాదగా అతిథులు లాగా సత్కరించాడు. సాయంత్రానికి అక్బర్, బీర్బల్ సెలవు తీసుకుంటుంటే, దారిలో తినడానికి కొంత తిను భండారం ఒక మూటలో కట్టి ఇచ్చాడు.

తిరిగి సభకు చేరాకా, బీర్బల్ అక్బర్తో, “ప్రభు! చూసారా! మిఠాయిలు చేసే వృత్తి ఎంచుకున్న వ్యాపారస్తుడికి తీయని స్వభావం లేదు, అలాగే బండలు కొట్టుకునే వృత్తి ఎంచుకున్న మేస్త్రికి సఖ్త హృదయము లేదు! మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం ఉండదని మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా?” అని అడిగాడు.

అక్బర్ చిరు నవ్వుతో బీర్బల్ చెప్పినది ఒప్పుకున్నారు.

ఆపదలో వున్న బాటసారులను ఆదుకున్న ఆ మేస్త్రికి, అతని కుటుంబానికి బహుమూల్యమైన బహుమతులు పంపించి, కృతజ్ఞత తెలియ చేసుకున్నారు.

ఎలుక ఆకలి

shutterstock_465953222

Image: Ritu Jagya / Shutterstock.com

అనగనగా ఒక ఎలుకకి బాగా ఆకలి వేసింది. తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని దగ్గరలోని పొలంలో వెతికింది.

వెతకగా, వెతకగా, ఒక బుట్ట నిండా మొక్కజొన్న పొత్తులు దొరికాయి. కాని బుట్టలో ఉన్న పొత్తులను తినడం ఎలా? చుట్టూరా ప్రదక్షిణ చేస్తే ఒక చోట బుట్ట చిరిగి, చిన్న కన్నం ఏర్పడి వుంది – అది కనిపించింది.

“అమ్మయ్య!” అనుకుని, ఎలుక అందులోంచి దూరి బుట్టలోకి వెళ్లి, బోకా బోకా పొత్తులు తినడం మొదలెట్టింది.

అంత ఆకలి మీద ఇంత భోజనం దొరికేసరికి ఎలుకకి ఆకలి నిండినా మనసుకు సరిపోలేదు. పొత్తులు తింటూనే వుంది. కొంచం సేపటికి కడుపు ఉబ్బి, బద్దలయ్యే స్థితికి వచ్చింది. అప్పుడు తినడం ఆపింది. ఇంక చాలు, బయట పడదాము అని ఎలుక మళ్ళీ కన్నం లోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసింది.

లోపలికి వెళ్లినప్పుడు బానే వెళ్ళిన ఎలుక బయటికి మట్టుకు రాలేక పోయింది. ఎందుకంటే వెళ్ళే డప్పుడు సన్నంగా వుంది. ఇప్పుడు తిని, తిని, కడుపు ఉబ్బి లావయి పోయింది. ఆ కన్నంలో ఇంక పట్టటం లేదు.

“ఇప్పుడెల?” అని ఖంగారు పడుతూ చాలా ఆలోచించింది.

అప్పుడే పక్క నుంచి ఒక కుందేలు వెళ్తోంది. కుందేలుని సహాయం అడిగింది.

కుందేలు, “ఇంకేం చేస్తావు, తిన్నదంతా అరిగి, మళ్ళీ ఆకలితో పొట్ట తగ్గేదాకా ఆగు. అప్పుడు అదే విధంగా సునాయాసంగా బయటి వస్తావు” అని సలహా ఇచ్చింది.

ఎలుక అలాగే చుట్టూరా తినడానికి మంచి రుచికరమైన పొత్తులు వున్నా, తిన కుండా, బాగా ఆకలి వేసి, పొట్ట మళ్ళీ లోపలి వెళ్ళే దాకా ఆగి, ఆ రంద్రంలోంచి బయట పడి గట్టిగా ఊపిరి పీల్చుకుంది.

ఏదైనా అతిగా దొరికితే మనకి మంచిది కాదు. అవసారినికి తగ్గట్టుగా ఉంటేనే మంచిది.

కోతుల టోపీలు

shutterstock_476785555

ఒక టోపీలు అమ్ముకునే అతను ఉండేవాడు. అతను అన్ని ఊళ్లూ తిరుగుతూ, అన్ని చోట్లకీ వెళ్లి టోపీలు అమ్ముతూ ఉండేవాడు.

ఒక రోజు అలాగే వ్యాపార పరంగా ప్రయాణం చేస్తుంటే అలసట అనిపించింది. మండుతున్న సూర్యుడు, భగ్గున ఎండ, ఆకలి, దాహం అన్నీ కలిసి పాపం అతన్ని ఇబ్బంది పెడుతున్నాయి.

దారిలో ఒక చెట్టు నీడలో ఆగి, తెచ్చుకున్న భోజనం తిని, మంచినీళ్ళు తాగి, తన టోపీల బస్తా పక్కన పెట్టుకుని, చెట్టు నీడ లో హాయిగా నిద్రపోయాడు.

కొంచం సేపటికి లేచి చూస్తే బస్తా లో ఒక్క టోపీ కూడా లేదు. అన్ని టోపీలు ఎవరో కొట్టేసారు. ఎవరై ఉంటారని దిక్కులు చూస్తుంటే చెట్టుపై చప్పుడు వినిపించింది. పైకి చూస్తే చెట్టు నిండా కోతులు ఉన్నాయి. ఊరికే ఉన్నాయా? ఒకొక్క కోతి తల మీదా ఒకొక్క టోపీ వుంది.

ఓహో ఇదా సంగతి అని టోపీలు అమ్ముకునే అతను “నా టోపీలు నాకు తిరిగి ఇచ్చేయండి” అని కోతులతో అన్నాడు.

అవి మాట వినే రకమా? గమ్మున కూర్చున్నాయి.

కోపంగా అతను అరిచాడు.

అవీ తిరిగి అరిచాయి.

చప్పట్లు కొట్టాడు.

అవీ కొట్టాయి.

ఒక రాయి విసిరాడు.

కోతులు చెట్టుకున్న పళ్ళు తిరిగి విసిరాయి.

కొడతానని బెదిరించాడు.

కోతులు నవ్వాయి.

చివరికి ఏమి చేద్దామా అని ఆలోచిస్తూ అలవాటు ప్రకారం ఒక చేత్తో తన తలపైనున్న టోపీ తీసి, ఇంకో చేత్తో తల గోక్కున్నాడు.

కోతులూ అలాగే చేసాయి.

ఠప్పున ఐడియా వచ్చి, తన చేతిలో వున్న టోపీ నేల మీదకి విసిరే సాడు.

వెంటనే కోతులు కూడా వాటి చేతుల్లో ఉన్న తోపీలను నేల మీదకు విసిరేశాయి.

టోపీలు అమ్ముకునే అతను గబ గబా ఆ టోపీలన్నీ మళ్ళి బస్తాలో వేసేసుకుని, వెనక్కి తిరిగి చూడకుండా పరుగో పరుగున పారిపోయాడు!

Image: Ritu Jagya/Shutterstock.com, used under license from Shutterstock.com. Please do not copy or reproduce

దేవుడా! కాపాడు!

shutterstock_584047801

ఒక వ్యాపారస్తుడు తన పనివాడితో ఎడ్లబండి మీదా అమ్మవలసిన సరుకులు వేసుకుని పోరుగూరిలోని సంతకి బయలుద్యారాడు.

దారి సరిగ్గా లేదు. చాలా గోతులు, గుంటలు వున్నాయి. వాన మూలంగా వాటిల్లో నీళ్ళు నిలిచి పోయాయి. జాగ్రత్త గా, నిదానంగా బండి తోలుకుంటూ కొనసాగారు. అందు మూలంగా అనుకున్నంత వేగంగా వెళ్ళలేక పోతున్నారు. ఇలా ఆలస్యం అయితే కొట్టు పెట్టుకోవడానికి మంచి చోటు దొరకక పోవచ్చని, సంతలో లాభం తగ్గిపోతుందేమో అని వ్యాపారస్తుడు చాలా దిగులుగా వున్నాడు.

ఉన్న కష్టాలు సరిపోవు అన్నట్టు హటాత్తుగా బండికున్న ఒక చక్రం గుంటలో దిగి మట్టిలో ఇరుక్కు పోయింది.

వ్యాపారస్తుడు ఎద్దులని ముందుకు నెట్టిన కొద్ది చక్రం ఇంకా ఇంకా కూరుకుపోతోంది. ఉన్న సమయం తక్కువ. మధ్యలో ఈ గొడవ.

వ్యాపారస్తుడు చేతులు జోడించి మనసంతా పెట్టి దేవుడిని ప్రార్థించాడు.
“దేవుడా! ఎలాగైనా ఈ ఆపాద నుంచి కాపాడు తండ్రి!” అని మొక్కుకున్నాడు.

దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. “ప్రతి చిన్న దానికి నన్ను తలుచు కోవడం ఎందుకు? నువ్వు బండి మీద కూర్చుని సమస్య అదే తీరిపోవాలంటే ఎలా కుదురుతుంది? ఒకళ్ళు దిగి మట్టిలోంచి చక్రం తోయ్యండి, మరొకరు చిన్నగా ఎడ్లని ముందుకు తోలండి.” అని సలహా ఇచ్చి అదృశ్యం అయిపోయాడు.

పనివాడు దిగి చక్రం వెనుక భుజం పెట్టి చక్రాన్ని మట్టిలోంచి తోసాడు. వ్యాపారస్తుడు అదే సమయాన్న యెద్దులను ముందుకు నెట్టాడు. చక్రం గుంటలోంచి బయట పడి బండి మళ్ళీ కదలడం మొదలెట్టింది.

అలా ఆ రోజు వ్యాపారస్తుడు సంతకీ వెళ్ళాడు, సరుకు అమ్ముకున్నాడు, లాభాలూ సంపాదించుకున్నాడు.

సమస్య వచ్చినప్పుడల్లా “దేవుడా! కాపాడు!” అనుకోకుండా మనకు తగ్గ కృషి మనం చేస్తే ఆ పై భగవంతుడు ఎలాగా అడగ కుండానే సహాయం చేస్తాడు.

Image: Ritu Jagya/Shutterstock.com, used under license from Shutterstock.com. Please do not copy or reproduce.

కర్రల కట్ట

bundle of sticks

ఒక తండ్రికి ఏడుగురు కొడుకులు ఉండేవారు. ఆ ఏడుగురూ ఎప్పుడూ దెబ్బలాడు కుంటూనే ఉండేవారు.

తండ్రి అన్ని విధాలా ప్రయత్నం చేసి చూసాడు. కొడుకులకు సద్ది చెప్పి, బుద్ధి చెప్పి, తిట్టి, కొట్టి, మందలించి, బుజ్జగించి, శిక్షలు విధించి – అన్నీ చేసాడు – కానీ పిల్లలు మట్టుకు కొట్లాడుకోవడం ఆప లేదు.

ఒక రోజు మామూలు కన్నా ఎక్కువ తీవ్రంగా దెబ్బలాడుకుంటున్న కొడుకులను చూసి తండ్రి చాలా బాధ పడ్డాడు.

కొడుకులని పిలిచి తలో కర్ర ముక్కని తీసుకుని రమ్మన్నాడు. ఏడుగురూ కర్రలను వెతికి తెచ్చారు. ఆ కర్రలను ఒక తాడుతో కట్టి ఒక కట్టలా చేయమన్నాడు. కొడుకులు కర్రల కట్ట తయ్యారు చేసారు.

తండ్రి ఒకొక్క కొడుకునీ ముందుకి పిలిచి ఆ కట్టని విరక్కోట్టమని ఆదేశించాడు. వంతులు వంతులు గా ఏడుగురూ ఆ కట్టను విరక్కోట్టడానికి ప్రయత్నం చేసారు, కానీ విరక్కొట్ట లేక పోయారు.

ఇప్పుడు తండ్రి కట్టలోని కర్రలను విడతీసి ఏడుగురిని తలో కర్ర తీసుకోమన్నాడు. అలా చేసాక, ఎవరి కర్రను వాళ్ళు విరక్కొట్ట మన్నాడు. కొడుకులు సునాయాసంగా విరక్కోట్టేసారు.

అప్పుడు తండ్రి వాళ్లకు జీవితాంతం గుర్తుండే ఈ మాట చెప్పాడు: “మీరందరూ ఈ కట్టలా కలిసి వుంటే మీరు బలంగా వుంటారు – మిమ్మల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు. కానీ విడి విడిగా ఈ కర్రలలా వుంటే మట్టుకు మీకు యే బలము వుండదు.”

(Image in this story is a free Bing clip art tagged as “Creative Commons Licensing” – any copyright violations are unintentional and image will be removed if you let me know.)

కొంగలు, తాబేలు

shutterstock_589493033

ఒక చెరువులో రెండు కొంగలు, ఒక తాబేలు ఉండేవి. ఆ సంవత్సరం వర్షాలు పడక పోవడం వల్ల చెరువులోని నీళ్ళు ఎండి పోయాయి.

కొంగలు రెండూ ఒక రోజు ఎగురుతుంటే ఒక కొత్త చెరువుని చూసాయి. అందులో నీళ్ళు చాలా ఉన్నాయి. అక్కడ చుట్టూరా పచ్చగా వుంది. చెరువులో బోలెడన్ని కప్పలు, పీతలు, చేపలు, అలా నీళ్ళల్లో వుండే వేరే జీవులు వున్నాయి.

కొంగలు వుండే పాత చెరువు నుంచి పెట్టీ, బేడా సద్దుకుని, కొత్త చెరువుకి వెళ్ళిపోవాలని అనుకున్నాయి. ఈ విషయం చర్చించుకుంటుంటే పక్కనే కూర్చున్న తాబేలు వింది.

“మీ తో పాటు నన్నూ తీసుకుని వెళ్ళండి, నేను ఒక్కర్తిని ఇక్కడ ఉండలేను.” అని బ్రతిమాలింది.

కొంగలు జాలి పడి తాబేలుని తీసుకుని వెళ్ళడానికి ఒప్పుకున్నాయి. కాని ఎలా? తాబేలు ఎగర లేదు. అలాగని నడుచుకుంటూ కూడా వెళ్ళ లేదు. తాబేలు చాలా నిదానంగా నడుస్తుంది కదా. పోనీ మోసుకుని తీసుకెళ్ళి పోదామంటే తాబేలు కొంగ వీపు మీదకి ఎక్కలేదు.

చివరికి ఒక ఐడియా వచ్చింది. తాబేలు ఒక కర్రను నోట్లో గట్టిగా పట్టుకుంటే, ఆ కర్రను తలోవైపు కొంగలో పట్టుకుని అలా ఎగురుకుంటూ కొత్త చెరువుకు చేరుకోవచ్చు అని అనుకున్నారు. తాబేలుకి చాలా ఉత్తేజం కలిగింది.

“ఎట్టి పరిస్థితిలోను నువ్వు నోరు తెరవకూడదు, గట్టిగా నోటితో కర్రని పట్టుకునే వుండాలి!” అని కొంగలు తాబేలును హెచ్చరించాయి. తాబేలు దీర్ఘంగా తల ఊపింది.

మొన్నాడు తెల్లారగానే అనుకున్న ప్రకారం కొంగలు రెండూ మధ్యలో తాబేలును మోస్తూ ఎగరడం మొదలెట్టాయి. తాబేలు మొదట్లో బానే కర్రని గట్టిగా పట్టుకుంది. కాని కొంచం సేపు ఎగిరాకా కింద భూమి మీద కొంత మంది పిల్లలు కనిపించారు.

పిల్లలు ఈ దృశ్యాన్ని చూసి, ఒకరికి ఒకరు చూపించుకుంటూ ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు. ఇది గమనించిన తాబేలు కొంగలకి చెప్పాలని నోరు తెరిచింది.

ఇంకేముంది. ధమ్మన కింద పడిపోయింది. దాని గుల్ల పగిలిపోయి పాపం ప్రాణాలు కోలిపోయింది.

మనకన్నా ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు, శ్రేయోభిలాషులు, మిత్రులు, ఇటువంటి వారు, మన మంచికి ఏదైనా చెప్తే, అది మనం పరిగణలోకి తీసుకుని, సమయానుకూలంగా అనుసరించాలి.

Image: Ritu Jagya/Shutterstock, used under license from Shutterstock.com. Please do not copy or reproduce.